ర్యాలీలు, సభలు నిషేధంపై సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ పోస్ట్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఉద్రిక్తతకు దారి తీయడం తెలిసిందే.సొంత నియోజకవర్గంలో చంద్రబాబునీ పోలీసులు పర్యటనను అడ్డుకోవడం సంచలనంగా మారింది.

 Pawan Kalyan Serious Post On Cm Jagan On The Ban On Rallies And Meetings Details-TeluguStop.com

ఈ క్రమంలో పోలీసులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరగటంతో లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.అయితే ఈ పరిణామం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.

ఓదార్పు యాత్ర పేరు మీద దశాబ్దం పాటు యాత్రలు చేయచ్చు, రోడ్‌ షోలు చేయచ్చు కాని; ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షాలు – ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనంలో తిరగడానికి కూడా అనుమతించకపోతే ఎలా?? మీరు అధికారంలో లేనప్పడు ఒక రూలు, మీరు అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా??” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన పింఛన్ ల గురించి ప్రశ్నలు వర్షం కురిపిస్తూ బహిరంగ లేఖ రాశారు.

పింఛన్ లు తొలగించి… మళ్లీ లబ్ధిదారులకు నోటీసులు పంపడం దారుణమని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube