వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రష్మిక హీరో హీరోయిన్లుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వారసుడు.తమిళంలో వరిసు పేరుతో తెరికెక్కిన ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పివిపి బ్యానర్స్ నిర్మించారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నైలో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ సినిమా నుంచి విడుదలైన రంజితమే… రంజితమే అనే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.ఇప్పటికే ఎంతోమంది ఈ పాటకు రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేదికపై ఈ పాటకు డాన్స్ చేశారు.అయితే జానీ మాస్టర్ తో పాటు రష్మిక సైతం వేదికపై డాన్స్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలోని హీరో విజయ్ రష్మిక గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ రష్మిక ఎంతో అద్భుతమైన నటి ఎంతో గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ అంతే ఒదిగి ఉంటారు.తను రీల్, రియల్ జీవితంలోనూ ఒకేలాగా ఉంటుంది.ఇప్పుడు కూడా అభిమానుల కోసం వేదికపై తాను డాన్స్ చేశారు.అయితే అందరి దృష్టి తనపై పడకుండా తనకు దిష్టి తీస్తున్న అంటూ ఈ సందర్భంగా తమిళంలో రష్మిక గురించి మాట్లాడుతూ తనకు దిష్టి తీశారు.దీంతో ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వీడియోలపై నేటిజన్స్ తమదైన శైలిలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.