ఇండియాలో జనాలు ప్రయాణించడానికి ఎన్ని మార్గాలున్నా ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు.ఎందుకంటే ఖర్చు తక్కువ పైగా సౌకర్యం కూడాను.
కాకపోతే ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో రాత్రిళ్లు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి.రైల్వే పోలీసులు తరచూ తనిఖీలు చేపట్టినా, నేరాలను పూర్తి స్థాయిలో అదుపుచేయలేకపోతున్నారు.
దీంతో రైళ్లలో మహిళలు, పిల్లలకు భద్రత కొరవడింది.ఈ విషయానికి చెక్ పెట్టడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
దీనిలో భాగంగా సుమారు 15,000 కోచ్లలో రూ.705 కోట్ల విలువైన CCTVలను అమర్చడానికి కేంద్రం చర్యలు చేపడుతోంది.కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని దురంతో, రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో 14,387 కోచ్లలో రైల్వే మంత్రిత్వ శాఖ CCTV కెమెరాలు అందుబాటులోకి తీసుకు రానుంది.అదే విధంగా EMU, MEMU, DEMU వంటి ప్యాసింజర్ రైళ్లకు కూడా ఈ సదుపాయం కల్పించనుంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ CCTV కెమెరాలు దేశవ్యాప్తంగా ఉండే మొత్తం రైళ్ళకీ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
2,930 రైలు కోచ్లను సీసీటీవీల ద్వారా కవర్ చేసినట్లు గత ఏడాది మంత్రిత్వ శాఖ పార్లమెంటులో తెలిపిన సంగతి అందరికీ తెలిసినదే.కాగా ప్రస్తుత ఆర్డర్ ఆ మొత్తానికి కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ కావడం అందించాల్సిన విషయం.మొత్తంగా 60,000 కోచ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.
ఈ క్రమంలో ప్రయాణికుల ప్రైవసీకి ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోనుంది.ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్డ్ CCTV కెమెరాలు వీడియో అనలిటిక్స్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్లను కూడా కలిగి ఉంటాయి.