అయ్యప్పస్వామిపై బైరి నరేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు.
ఇతర మతస్థుల నమ్మకాలను దెబ్బతీయొద్దని సూచించారు.రెచ్చగొట్టేలా మాట్లాడటం, మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం సహించరానిదని తెలిపారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని వెల్లడించారు.