భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను అహ్మదాబాద్ యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం హీరాబెన్ మోదీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా తల్లిని పరామర్శించేందుకు ప్రధాని మోదీ అహ్మదాబాద్ వెళ్లే అవకాశం ఉంది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.ఇటీవలే హీరాబెన్ వందో సంవత్సరంలోకి అడుగు పెట్టారు.







