టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియ శరన్ అందరికీ తెలిసిందే.తన నటన పరంగా తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కులు సంపాదించుకుంది.
తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.
ఇక శ్రియ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది.కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.అలా వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది.మంచి హోదాలో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఇక తమకు ఒక పాప పుట్టగా ఆ విషయాన్ని చాలా రోజుల వరకు బయట పెట్టలేదు శ్రియ.
ఆ తర్వాత తానే ఆ విషయాన్ని తెలిసి అందరికి షాక్ ఇచ్చింది.
ఇక సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది.నిత్యం తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.
పైగా ఆ ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.ఎందుకంటే ఆ ఫోటోలు ఫుల్ రొమాన్స్ తో నిండిపోయి ఉంటాయి.

లేటు వయసులో కూడా శ్రియ అందాలు ఏ మాత్రం కూడా తగ్గలేదు.ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.ఇక తాజాగా తను తన ఇన్ స్టా లో ఒక హాట్ ఫోటో వదిలింది.హ్యాపీ ట్యూస్డే అంటూ తన అందాలను బయటపెట్టింది శ్రియ.ఆ ఫోటోలో తను బాగా గ్లామర్ షో చేయగా అందులో తన ఎద అందాలు, థైస్ అందాలతో రెచ్చిపోయింది.
ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఈ వయసులో కూడా తన అందాలను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్.
ఇక ఇటీవలే శ్రియ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈసారి హీరోయిన్ పాత్రలు కాకుండా సహాయ పాత్రలలో అవకాశాలు అందుకుంటుంది.ప్రస్తుతం తను ఓ సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.







