తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా ఈడీ అధికారులు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ ను విచారించనున్నారు.
ఈ క్రమంలో నందకుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డ్ చేయనున్నారు.ఈ మేరకు చంచల్ గూడ జైల్లోనే నందకుమార్ విచారణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కాగా సాయంత్రం 5 గంటల వరకు విచారించే అవకాశం ఉంది.







