నేడు క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈరోజు చర్చిలలో క్రీస్తు జన్మనికి సంబంధించి శుభసందేశాలను స్మరించుకుంటారు.
ఏసుక్రీస్తు ఆసియా ఖండంలో పుట్టిన గాని.క్రిస్మస్ పండుగ ఎక్కువగా యూరప్ దేశాలలో చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు.
ఇక ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ఒకరికి మరొకరు తెలియజేసుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ క్రిస్మస్ పండుగ నాడు బహుమతులు పంచుకుంటుంటారు.
క్రిస్మస్ పండుగ సందర్బంగా…దేశ ప్రధాని మోడీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
“మేరీ క్రిస్మస్! ఈ ప్రత్యేకమైన శుభదినం మన సమాజంలో సామరస్యం, ఆనంద స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలి.ప్రభువైన క్రీస్తు ఉదాతమైన ఆలోచనలను… సమాజానికి సేవ చేయడానికి మేము అంగీకరిస్తూ గుర్తు చేసుకుంటున్నాము” అని.మోడీ ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.