ఆస్ట్రాలజర్ వేణు స్వామి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.ఈయన ప్రముఖ జ్యోతిష్యుడుగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించి వారి జాతకాలను తెలియజేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
ఇక ఈయన చెప్పిన విధంగానే కొందరి సెలబ్రిటీల జీవితంలో జరగడం వల్ల ఈయన తరచూ ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలువురు సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి మరోసారి సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం సమంత మయోసైటిసిస్ అనే వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉన్నారు.ప్రస్తుతం ఈ వ్యాధితో తలపడుతూ చికిత్స తీసుకుంటున్నటువంటి సమంత గురించి వేణు స్వామి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సమంత ఆరోగ్యం గురించి వేణు స్వామి మాట్లాడుతూ తనకు 2025 వరకు ఎలాంటి ఇబ్బందులు లేవని 2025వ సంవత్సరం తర్వాత ఆమె జాతకంలో ఏలినాటి శని ప్రారంభమవుతుందని, అప్పటినుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని తెలిపారు.

ఇలా సమంత ఆరోగ్యం గురించి ఈయన మాట్లాడుతూ…ఆమె మరిన్ని అనారోగ్య సమస్యలన్నీ ఎదుర్కొంటుందని చెప్పడంతో అభిమానులు కాస్త ఆందోళన పడినప్పటికీ మరికొందరు మాత్రం ఈయన వార్తలను కొట్టి పారేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన ఒక యంగ్ హీరో హీరోయిన్ చనిపోబోతున్నారు అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.వేణు స్వామి సెలబ్రిటీల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.







