స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో నెలకొన్న వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు.స్మార్ట్ మీటర్లపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
స్మార్ట్ మీటర్లలో అనేక సదుపాయాలు ఉండటంతో సాధారణంగానే వాటి ధర ఎక్కువగా ఉంటుందని చెప్పారు.మామూలు మీటర్లతో పోల్చి ధర ఎక్కువ అని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి ప్రభుత్వం ఇవి మంజూరు చేయలేదని పేర్కొన్నారు.ఎవరైనా సరే టెండర్లలో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు.
కేంద్రం నిర్ణయించిన సూచనల మేరకు టెండర్లని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి త్వరలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.కేవలం జవాబుదారీతనం తీసుకుని రావడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు.