తెలంగాణ కాంగ్రెస్ కు హైకోర్టులో ఊరట లభించింది.వార్ రూమ్ ఘటనలో పోలీసుల విచారణపై న్యాయస్థానం స్టే విధించింది.
అదేవిధంగా 41 సీఆర్పీసీ నోటీసులపై కూడా స్టే ఇచ్చింది.ఇషాన్, శశాంక్, ప్రతాప్ లకు పోలీసులు నోటీసులు ఇవ్వగా.
ఆ నోటీసులను కొట్టివేయాలని కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో కేసు విచారణతో పాటు నోటీసులపై ధర్మాసనం స్టే ఇచ్చింది.
అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.







