ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురవడం జరిగింది.దక్షిణాదిలో భారీ స్థాయిలో తుఫానులు రావడంతో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి.
ఫలితంగా ప్రజలు మరియు రైతుల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సంవత్సరం చివరాఖరిలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందట.
దీంతో రాబోయే మూడు రోజుల్లో తమిళనాడులో విస్తారమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఈ అల్పపీడన ప్రభావం ఏపీలో కూడా ఉంటుందని దీంతో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయుగుండంగా మారడం జరిగిందంట.ఈ వాయుగుండం శ్రీలంక మీదుగా పయనించే అవకాశం ఉందని ఐఎండి స్పష్టం చేసింది.దీంతో రాబోయే మూడు రోజుల్లో తమిళనాడులో భారీ వర్షాలు పోరాటంతో పాటు ఏపీపై ద్రోణి ప్రభావం ఉండనుందని పేర్కొన్నారు.ఈ కారణంగా ఏపీలో చలి ప్రభావం పెరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలుముకునే అవకాశం ఉందని.
వాతావరణ శాఖ అధికారులు సూచించారు.







