సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్, అనుపమ హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం 18 పేజెస్. ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర బృందం.ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.నటుడిగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు సుకుమార్ కారణం.
ఎందుకంటె ఆయన లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదని నేనెప్పుడూ అనుకుంటాను.నాకు బాగా కావలసిన వారంతా కలిసి తీసిన సినిమా ఇది.సొంత ఓటీటీలో కాకుండా థియేటర్లో విడుదల చేయాలనుకునే నిర్మాత మా నాన్నను గౌరవిస్తాను.గోపీ సుందర్ సంగీతం బావుంది.
ఆయనతో పని చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నా.ఆర్య నుంచి సూర్య ప్రతాప్ తెలుసు.
ఆలస్యమైనా మంచి చిత్రాలే తీయాలనుకుంటారు.హ్యాపీడేస్ నుంచి నిఖిల్ను గమనిస్తున్నా.

ఇలాంటిమంచి కథల్ని ఎలా ఎంపిక చేసుకుంటావ్ అని అతన్ని ఓసారి అడిగాను ఈ చిత్రం అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా.ఇలాంటి కథని సుకుమార్ ప్రొడ్యూస్ చేేస్త 18 పేజెస్ అదే ఆయన డైరెక్షన్ చేేస్త 118 పేజెస్ అవుతుంది నవ్వుతూ సమాధానం ఇచ్చారు.ఇకపోతే అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే గత ఏడాది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జుజ్ ఆ సినిమా విడుదల అయ్యి ఈ ఏడాది పూర్తి అవుతున్నా కూడా ఇతర సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అంతేకాకుండా పుష్ప 2 కి సంబంధించిన షూటింగ్ కూడా ఇంకా మొదలు పెట్టలేదు.







