కాకినాడ జిల్లా కుయ్యేరు గ్రామంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.నాలుగు సంవత్సరాలుగా ఓ తల్లీకూతురు ఇంటికే పరిమితమైయ్యారు.
కరోనా సమయంలో బయటకు రాకూడదనే మణి, దుర్గాభవానీలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.బయటకు కరోనా వస్తుందనే భయంతో దుప్పటి కప్పుకుని అందులోనే ఉండిపోయారు.
ఎవరూ మాట్లాడినా కూతురు దుప్పటిలో ఉండి సమాధానం చెబుతుంది.తల్లి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో కుటుంబీకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో వారిని బయటకు తీసుకు వచ్చేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.







