మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది.చిన్నారి ఇందు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఊపరితిత్తుల్లో నీరు చేరడంతోనే చిన్నారి మృతి చెందిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.గత కొన్ని రోజుల కిందట స్కూల్ కు వెళ్లిన ఇందు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.
ఆ తరువాతి రోజు దమ్మాయిగూడ చెరువులో శవంగా లభ్యమైంది.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇందులో భాగంగా ఇందు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.







