తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఎలా రక్షించుకోవాలనే దానిపై భేటీలో చర్చించామని చెప్పారు.
అసలు పార్టీ నేతలను కావాలని సామాజిక మాధ్యమాల్లో బద్నామ్ చేస్తున్నారని మండిపడ్డారు.అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇటీవల ఏర్పాటైన కమిటీలపై పలువురు నాయకులు అసంతృప్తి ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లామని వెల్లడించారు.
అసంతృప్తులను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లానని భట్టి స్పష్టం చేశారు.







