బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.2002వ సంవత్సరంలో సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో దోషులగా తేలిన 11 మందిని విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిల్ పై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.
గుజరాత్ లో గోద్రా రైలు దహనం ఘటన తర్వాత జరిగిన అల్లర్ల నుంచి పారిపోతై బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైంది.
చనిపోయిన కుటుంబ సభ్యుల్లో తన మూడేళ్ల కూతురు కూడా ఉంది.అయితే నిందితుల ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ లకు ప్రతి స్పందనగా గుజరాత్ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది.
పదకొండు మందిని సత్ప్రవర్తనపై 14 సంవత్సరాల శిక్షను పూర్తి చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో విడుదల అయ్యారని అఫిడవిట్ లో పేర్కొంది.