దమ్మాయిగూడ జవహర్‎నగర్‎లో ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని జవహర్‎నగర్‎లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పోస్టుమార్టం పూర్తి కావడంతో చిన్నారి ఇందు మృతదేహన్ని పోలీసులు జవహర్‎నగర్‎ కు తరలించారు.

 Tension In Dammaiguda Jawaharnagar-TeluguStop.com

అయితే పోస్టుమార్టం నివేదికను ఇవ్వకుండా మృతదేహాన్ని పోలీసులు అప్పగిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిన్నారి మరణానికి కారణాలు ఏంటో తేల్చాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు.

దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.పాపను గంజాయి బ్యాచ్ చంపి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో దమ్మాయిగూడలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

అయితే చిన్నారి పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు.

ఇందు ఊపిరితిత్తులో నీరును గుర్తించిన వైద్యులు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేల్చారు.చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube