పంట నష్టం అంచనాలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని సీఎం జగన్ అన్నారు.ఎక్కడా రైతులు నిరాశకు గురి కాకూడదని చెప్పారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, తక్కువ రేటు కొనుగోళ్లు చేస్తున్నారనే మాట ఇకపై వినిపించకూడదని తెలిపారు.
మళ్లీ పంటలు వేసుకోవడానికి 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు అందించాలని వెల్లడించారు.అదేవిధంగా వరదల కారణంగా ఇళ్లు ముంపునకు గురైనవారికి రూ.2వేలతో పాటు రేషన్ అందించాలని ఆదేశించారు.







