పదవ తరగతి పరీక్ష ఫీజుల గడువు పొడిగించిన ఏపి ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక అప్ డేట్ ఇవ్వటం జరిగింది.వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానంద రెడ్డి తెలిపారు.₹50 రూపాయల ఫైన్ తో ఈనెల 26వ తేదీ వరకు, ₹200 రూపాయల ఫైన్ తో జనవరి 2, ₹500 రూపాయల ఫైన్ తో జనవరి 9 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు.కాగా మార్చి/ఏప్రిల్ నెలలో పరీక్షలు జరగనున్నాయి.

 Govt Extends 10th Class Exam Fees Deadline Governament Of Andhra Pradesh, Tenth-TeluguStop.com

వాస్తవానికి ఈ పరీక్షలు ఫీజు చెల్లింపు తేదీలు ప్రారంభంలో నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 లోగా  చెల్లించాలని తెలియజేశారు.ఈ పరీక్షకు సంబంధించి ఒకో విద్యార్థి ₹125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది.

ఈ క్రమంలో నిర్దేశించిన గడువులోగా ఫీజులు చెల్లించలేని విద్యార్థులు తాజాగా పైన ఫైన్ తో కలిపి అసలు ఫీజు చెల్లించే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube