నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.ఆంక్సాపూర్ గ్రామంలో కట్టుకున్న భర్తనే ఓ భార్య అతి కిరాతకంగా హత్య చేయించింది.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హత్యకు చేయించిందని సమాచారం.అక్టోబర్ నెలలో మరో ఇద్దరు వ్యక్తులతో కలసి భర్తను హతమార్చింది.
అనంతరం వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో భర్త రంజిత్ కనబడటం లేదని ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు నిలదీయడంతో తప్పును ఒప్పుకుంది.
రంగంలోకి దిగిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బయటకు తీశారు.అనంతరం నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.