దేశవ్యాప్తంగా సినిమా అంటే పడి చచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రికెట్ అంటే కూడా అంతే ఇష్టమైన వారు చాలామంది ఉన్నారు.కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం క్రికెట్ ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు.
అలా సెలబ్రిటీలు సైతం క్రికెట్ ని ఇష్టపడుతూ అందులో ఉన్నాయి క్రికెటర్స్ తో స్నేహం పెంచుకొని ఆ తర్వాత ప్రేమగా మారి ఆపై పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే కొన్ని జంటలు పెళ్లి వరకు వచ్చి ఆగిపోగా మరికొన్ని జంటలు వివాహంతో ఒక్కటయ్యారు.
ఉదాహరణగా విరాట్ కోహ్లీ,అనుష్క శర్మ చెప్పుకోవచ్చు.
అయితే కొంతమంది క్రికెటర్స్ హీరోయిన్స్ మధ్య ఉండే స్నేహాన్ని కూడా ప్రేమ అనుకొని భ్రమపడుతూ ఏవేవో వార్తలు రాస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు.
ఇలా తరచూ హీరోయిన్లకు మధ్య ఏదో వ్యవహారం నడుస్తోంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా మరాఠీ నటి సయాలీ సంజీవ్, క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ మధ్య ఏదో ఉందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ వార్తలపై సయాలీ సంజీవ్ స్పందించింది.మా మధ్య ఏం లేదు.ఈ రూమర్స్ వల్ల మా స్నేహం కూడా దెబ్బతింది.
కనీసం మంచి స్నేహితులుగా కూడా మాట్లాడుకోవడం లేదు.
అక్కడ ప్రేమ,దోమ ఏమీ లేదు.
అయినా మమ్మల్ని ఎందుకు లింక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు.దీని వల్ల మా వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అది పుకార్లు పుట్టించేవాళ్లకు ఎందుకు అర్థమవట్లేదు? అతను మంచి ఆటగాడు,ఆ విషయం గురించే మేం మాట్లాడుకునేవాళ్లం.కానీ తర్వాత అది కూడా మానేశాము.అయితే నిజానికి మా భాగస్వాములను ఎంచుకున్నాకైనా జనాలు మాది స్నేహమని తెలుసుకుంటారులే అనుకున్నాను.కానీ ఈ పుకార్లు ఇలా వ్యాప్తి చెందుతూనే ఉంటే ఎన్నటికైనా ఇబ్బందేనని గ్రహించాము.ఇంట్లోవాళ్లకు కూడా సమస్యేనని అర్థం చేసుకున్నాము.
అతడు ఏదైనా విజయం సాధించినప్పుడు కంగ్రాట్స్ చెప్దామనిపించినా ఆ పని చేయలేకపోతున్నా.అతనిది కూడా అదే పరిస్థితి అని చెప్పుకొచ్చింది సయాలీ సంజీవ్.