వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తామని సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు.
నిబంధనలకు లోబడే పాదయాత్ర చేసుకోవాలని తెలిపారు.రాజకీయ స్వార్థం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని వెల్లడించారు.
శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే సహించేది లేదన్నారు.ఉద్రిక్తతకు కారణమైతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
కాగా ఈ రోజు నుంచి షర్మిల పాదయాత్ర పున: ప్రారంభం కానుంది.







