ఇండియాలో రోడ్డు ప్రమాదాలు జరగడం చాలా సర్వసాధారణం.మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఎదుటి వ్యక్తి ఎలా వస్తాడో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
దీనివల్ల తప్పు చేయకపోయినా మృత్యువాత పడే అవకాశాలు రోడ్లపై అధికంగా ఉంటాయి.ఒక్కోసారి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంతమందికి హార్ట్ ఎటాక్ కూడా వస్తుంది.
ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలానే జరిగాయి.అయితే ఈ సంఘటనల్లో చాలావరకు డ్రైవర్లు ప్రయాణికులకు ఏం కాకుండా చివరి సెకన్లో కాపాడగలిగారు.
కాగా తాజాగా ఒక డ్రైవర్ బస్ నడుపుతున్నాడా హార్ట్ ఎటాక్ వచ్చింది.తర్వాత అతడు యాక్సిడెంట్ చేయడంతో ఇద్దరు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక బసు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు.డ్రైవర్ మరణించడంతో ఆ సిటీ బస్సు అదుపు తప్పి అక్కడే ఉన్న కొన్ని వాహనాలను ఢీ కొట్టింది.ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఘోరం జరగడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ సంఘటన రికార్డు అయింది.
సిటీ బస్సు తన ముందున్న బైకర్స్ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు, మరి కొంతమంది గాయపాలయ్యారు.
ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారి ప్రకారం, సిటీ బస్సు గోపాల్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం వైపుగా వెళ్తోంది.డ్రైవర్ చనిపోవడంతో బస్సు దారి తప్పి అక్కడే ఉన్న కొన్ని వాహనాలను ఢీ కొట్టి, ద్విచక్ర వాహనాలను కొంత దూరంగా ఈడ్చుకుంటూ వెళ్ళింది.ఇదంతా మనం సీసీ టీవీ ఫుటేజ్లో గమనించవచ్చు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని, బస్సు డ్రైవర్ను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.అయితే వైద్యులు బస్సు డ్రైవర్ గుండె పోటుతో మరణించాడని నిర్ధారించారు.