బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ ప్రస్తుతం లెక్కలేనన్ని బుల్లితెర, టీవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.మరే యాంకర్ గురించి రాని స్థాయిలో రష్మీ గురించి వార్తలు వైరల్ అయ్యాయి.
రష్మీ సుధీర్ త్వరలో కలిసి ఒక సినిమాలో నటించనుండగా గజ్జల గుర్రం టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని సుధీర్ రష్మీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
అయితే రష్మీ తాజాగా బోర్ కొడుతుంది తోడు కావాలి అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.
రష్మీ ఆ పోస్ట్ లో ఫిష్ స్టోరీ అని పెట్టి నేను నీతో స్నేహం చేయొచ్చా అని రష్మీ పేర్కొన్నారు.నేను బోరింగ్ గా ఒంటరిగా ఫీల్ అవుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.
నువ్వు నాకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ అని రష్మీ ఫిష్ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మీ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్మీ వయస్సు పెరుగుతున్నా అదే సమయంలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది.రష్మీ ప్రస్తుతం ఎపిసోడ్ కు లక్ష రూపాయల చొప్పున పారితోషికం అందుకుంటున్నారని సమాచారం.ఈటీవీ షోల ద్వారా నెలకు 10 లక్షల రూపాయల రేంజ్ లో రష్మీ ఆదాయాన్ని సొంతం చేసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

అయితే కథ మరీ అద్భుతంగా ఉంటే సినిమాలో హీరోయిన్ గా ఫ్రీగా నటించడానికి కూడా సిద్ధమేనని రష్మీ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో రష్మీ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రష్మీ ఫ్రీగా నటించారు.







