అనుపమ పరమేశ్వరన్ … అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఈ ముద్దు గుమ్మ అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు.శతమానం భవతి సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే వచ్చిన ఆమెకు సరైన ఆఫర్స్ అయితే రాలేదు.
ఇక ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా ఆమె ఒక క్రేజీ హీరోయిన్ కాలేకపోయింది అనేది మాత్రం నిజం.ఇక ఈ మధ్య వచ్చిన కార్తికేయ 2 సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఈ సినిమా హిట్ అవ్వడం తో ఆమె కెరీర్ వేగం కూడా పెరిగింది.ప్రస్తుతం ఆమె చేతిలో అర డజన్ ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీ హీరోయిన్ గా ఉంది.
కార్తికేయ సీక్వెల్ సినిమా విజయవంతం కావడం తో ఆమె డిమాండ్ ఫుల్ గా పెరిగింది.దాంతో ఎన్నో ఏళ్లుగా స్తబ్దుగా ఆమె రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది.మరి దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి అనే విధంగా ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఉంటున్నారు కదా.అనుపమ మాత్రం ఏం తక్కువ తింది.ఒక్క సినిమా ఫ్యాన్ ఇండియా సినిమా కావడం తో ఆమె పారితోషకం చుక్కలో ఉంది.అయినా కూడా ఆమె చేతిలో మంచి ప్రాజెక్ట్స్ తో ఉంది.ప్రస్తుతం 18 పేజెస్ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉంది అనుపమ.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
మొన్నీ మధ్య ఈ సినిమాలో వచ్చిన లిరికల్ సాంగ్ చాల బాగుంది.
ఈ సినిమా కాకుండా బటర్ ఫ్లయ్ అనే మరొక తెలుగు సినిమాకు సైతం సైన్ చేసింది.స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతుంది.తెలుగు మాత్రమే కాకుండా సిరెన్ అనే తమిళ సినిమా కూడా చేస్తుంది.
ఇక ఆమె సొంత బాషా మలయాళంలో ట్రూత్ షెల్ ఆల్వేస్ ప్రివెల్ అనే చిత్రం సైతం ఒప్పుకుంది.ఇవన్నీ చేతి నిండా ఉన్నప్పటికి సిద్దు జొన్నల గడ్డ తో డీజే టిల్లు సీక్వెల్ లో నటించడానికి ఒప్పుకుంది.
అతడి అట్టిట్యూట్ తట్టుకోలేక ఆ సినిమా నుంచి బయటకు వచ్చింది.ఇప్పుడు నటిస్తున్న సినిమాల్లో సగం సినిమాలో హిట్ అయినా కూడా అనుపమ కెరీర్ కి ఇక డోకా ఉండదనే చెప్పాలి.