ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్..
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.పుష్ప సినిమాతో ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఈ సినిమా దాదాపు 400 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే.
ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సుకుమార్ కూడా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.ఇటీవలే ఈ సినిమా షూట్ కూడా మొదలు పెట్టారు అనే విషయం ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతుంది.
ఈ సీక్వెల్ ను మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో రెండవ పార్ట్ మరింత గ్రాండ్ గా విజువల్స్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా టీమ్ ఇప్పుడు రష్యాలో ప్రత్యక్షం అయ్యింది.ఎందుకంటే డిసెంబర్ 8న రష్యాలో పుష్ప సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అంతకంటే ముందే డిసెంబర్ 1, 3న వరుసగా మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ లలో ప్రత్యేక ప్రీమియర్స్ వేయనున్నారు.
వీటికి హాజరు అయ్యేందుకు పుష్ప టీమ్ అంతా రష్యాకు బయల్దేరి వెళ్ళింది.అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న టీమ్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్నీ పంచుకుంటూ ఫోటోలు పెట్టగ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.