బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉండి కేవలం సినిమాలో వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు కాస్త నిరాశ ఎదురవుతుంది.
బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ బుల్లితెరకు దూరమైన అనంతరం ఈమెకు వరుసగా చేదు అనుభవాలు ఎదురు కావడంతో చాలామంది జాతకంలో దోషం కారణంగానే ఇలా అనసూయకు చేదు ఫలితాలు ఎదురవుతున్నాయని వార్తలు కూడా వినిపించాయి.
ఇలా సినిమాల పరంగా మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున నెట్టిజెన్ల నుంచి చేదు అనుభవాలను ఎదుర్కొంది.
తన జాతకం చూయించుకొని జాతక దోషం కోసం పరిహారాలను పాటించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి తన సొంత గ్రామంలో తన కుల దైవం పూజలు నిర్వహించినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే అనసూయ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోలలో అనసూయ ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని నిండు ముత్తైదువుల తయారు కావడంతో చాలామంది ఇలా చూసి ఎన్ని రోజులైంది అనసూయ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే ఈమె నెటిజన్ల ట్రోలింగుకు గురై పెద్ద ఎత్తున తన పట్ల నెగిటివ్ గా ట్రోల్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.