తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది.దీనిలో భాగంగా త్వరలో పీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లను మార్చే అవకాశం ఉంది.పీసీసీ కార్యవర్గం కూర్పు, డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు సంస్థాగత మార్పులపై కార్యాచరణ చేపట్టాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం సూచించినట్లు సమాచారం.
అదేవిధంగా అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలతో మాట్లాడి అందరినీ కలుపుకుని పని చేయాలని రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.







