ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు సాగు సర్వేకు బ్రేక్ పడింది.సమస్యలు పరిష్కరించే వరకూ పోడు సర్వేను బహిష్కరించాలని అటవీ శాఖ ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు.
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ మేరకు విధులు బహిష్కరించిన సిబ్బంది తమకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
అదేవిధంగా పారా మిలటరీ బలగాలతో ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.అడవుల్లో గుత్తి కోయల నివాసాలను తొలగించాలని కోరుతున్నారు.







