తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మారి కారణంగా సినిమాలకు దూరం అయింది.
అయితే క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆ క్యాన్సర్ వ్యాధికి సంబంధించి అవగాహన కల్పిస్తూ తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ వచ్చింది.
అయితే క్యాన్సర్ మహమ్మారితో సుదీర్ఘ కాలం పాటు పోరాడి చివరికి గెలిచింది.
క్యాన్సర్ తో నుంచి పోరాడి గెలిచిన తర్వాత మమతా మోహన్ దాస్ తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం కేవలం నటనకు ప్రాధాన్యమైన పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.
ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా మమతా మోహన్దాస్ ఆరోగ్య విషయంపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.మమతా మోహన్ దాస్ మరొకసారి క్యాన్సర్ మహమ్మారి బారిన పడిందని రోజురోజుకీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే ఇదివరకటిలాగా క్యాన్సర్ తో పోరాడే శక్తి లేకపోవడంతో ఆమె ఆ వ్యాధికి లొంగిపోయింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఆ వార్తలపై స్పందించింది మమతా మోహన్ దాస్.తాను మళ్ళీ క్యాన్సర్ బారిన పడలేదని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన పని తాను చేసుకుంటూ సంతోషంగా ఉన్నట్లుగా చెప్పింది.అయితే కొంతమంది క్లిక్కుల కోసం ఇలాంటి చెత్త చెత్త వార్తలు రాయకుండా మీరు కూడా మీ పని చేసుకుంటే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు చెక్ పెట్టడమే కాకుండా అలాంటి వార్తలను సృష్టిస్తున్న వారికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.
అలాగే నేను మళ్ళీ క్యాన్సర్ బారిన పడినట్లు ఫేక్ వార్తలు చూసిన సన్నిహితులు శ్రేయోభిలాషులు అందరూ ఆందోళన చెందుతున్నారు.వాళ్ల నుంచి నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి.
కాబట్టి నా ఆరోగ్యం విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.నా ఆరోగ్యం విషయంపై వస్తున్న ఫేక్ వార్తలను నమ్మకండి అని తన ఇంస్టాగ్రామ్ లో రాసుకు వచ్చింది మమతా మోహన్ దాస్.