అనంతపురము: తాడిపత్రిలో జరిగిన రాళ్ల ధాడిపై స్పందించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి.ఎమ్మెల్యే పెద్దారెడ్డి కామెంట్స్….
జేసి ఉనికినీ కాపాడుకొవడం కోసమే ఇందంతా చేశారు.వైసిపి కార్యకర్త హాజీ ఇంటికి వెళ్లి మేము మీకు టికెట్ ఇస్తే వైసిపిలోకి వెళుతావా అంటు జేసి అస్మిత్ రెడ్డి ముందే టిడిపి నాయకులు బెదిరించారు.
నాకు ఏపార్టీ మీద అబిమానముంటే ఆపార్టీలో ఉంటానని వైసిపి కార్యకర్త హాజీ చెప్పడంతొ టిడిపి వర్గీయులు ధాడిచేశారు.టిడిపి వర్గీయుల ధాడిలో వైసిపి కార్యకర్త తలకు భలమైన గాయం అయ్యి పరిస్థితి విషమంగా ఉంది.
మెరుగైన చికిత్స కొసం అనంతపురము ఆసుపత్రికి తరలించారు.
ఇలాంటి ధాడులకు బెదిరింపులకు తాడిపత్రిలో వైసిపిలోకి వలసలు ఆగవు.
తాడిపత్రికి తాగునీరు రాకుండా వైసిపి నాయకులు అడ్డుకుంటుంన్నారని టిడిపి వాళ్లు మాట్లాడుతున్నారు.తాడిపత్రికి జేసి నాగిరెడ్డి తాగునీటి పథకానికి ప్రాణంపోసిందే వై యస్ ఆర్ పార్టీ.
ఏదైనా మాట్లాడే ముందు ఇంగిత ఙ్ఞానం ఉండాలి.చంద్రబాబు గ్రామాలకు ప్రజల్లోకి వెళ్లండి అని చెబితేనే ఈరోజు ప్రజల్లోకి వచ్చారు.30 సంవత్సరాలు రాజకీయం అని చెప్పుకునే జేసి సోదరులకు వాళ్ల నాయకుడు చెప్పేవరకు ప్రజా సమస్యలు గుర్తురావా.