నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వీర సిం హా రెడ్డి మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ తర్వాత 108వ సినిమాగా అనీల్ రావిపుడితో ఫిక్స్ చేసుకున్నాడు బాలయ్య.
ఈ మూవీ గురించి అనీల్ రావిపుడి కొన్ని హింట్స్ ఇచ్చాడు.పటాస్ తో మొదలు పెట్టి ఎఫ్ 3 వరకు కామెడీ మూవీస్ చేసిన అనీల్ రావిపుడి మాన్ ఆఫ్ మాసెస్ అయిన బాలయ్యతో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.
అయితే వారికోసం సినిమా వేరే లెవల్ లో ఉంటుందని చెప్పి అంచనాలు పెంచాడు అనీల్ రావిపుడి.
తను తీస్తున్న ఫన్ మూవీస్ కి భిన్నంగా బాలకృష్ణ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు అనీల్ రావిపుడి.
మొదటి సినిమా నుంచి కామెడీతోనే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న అనీల్ రావిపుడి పూర్తి స్థాయిలో మాస్ మూవీ చేస్తున్నట్టు వెల్లడించారు.మరి బాలయ్యతో వేరే లెవల్ అంటున్న అనీల్ ఎలాంటి సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఎన్.బి.కె 107 మూవీ పూర్తి కాగానే వెంటనే 108వ సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.