చాలామంది సీజన్ని బట్టి చన్నీళ్లతో లేదా, వేడినీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు.ఎందుకంటే కొన్ని సీజన్లో చన్నీటి నీళ్లతో లేదా వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల ఎంతో ప్రమాదాలు ఎదురవుతాయి.
అయితే అందులో ముఖ్యంగా కొన్ని కొన్ని సీజన్లలో చన్నీటి నీళ్లతో స్నానం చేయడం చాలా ప్రమాదకరం.ప్రధానంగా చాలామంది చలికాలంలో చన్నీటి స్నానం చేయడానికి ధైర్యం చేయరు.
అయినప్పటికీ తొందరపాటులో, ఈ బిజీ లైఫ్ లో కొంతమంది స్నానానికి వేడి నీళ్లు ఉపయోగించకుండా చన్నీళ్లుతో స్నానం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.అయితే అలా చేయడం వల్ల ఎంతో ప్రమాదకరం.
అదేవిధంగా ఓ 68 ఏళ్ల వ్యక్తి చన్నీటితో చలికాలంలో స్నానం చేశాడు.దీంతో అతనికి బిపి పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.
అందుకే చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ప్రమాదం ఉందని ఆరోగ్య నిపులు కూడా సూచిస్తున్నారు.
దీని వల్ల జలుబు రక్తపోటు పెరిగి రక్తనాళాలు సంకోచిస్తాయి.
దీంతో గుండెపోటు లేదా స్ట్రోక్ కూడా వస్తుంది.అయితే చన్నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
చన్నీటితో స్నానం చేస్తే శరీరంలో మంటను తగ్గిస్తుంది.నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే అలసట తగ్గుతుంది.ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.

అలాగని శీతాకాలంలో మాత్రం ఇలా స్నానం చేయడం ఒక రకంగా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలా స్నానం చేయడం వల్ల కండరాలకి తగినంత రక్తం లభించినప్పుడు రక్తం గడ్డకట్టి గుండెపోటు లేదా స్ట్రోక్ వస్తుంది.అలాగే ఇది ఆక్సిజన్ సరఫరా అని కూడా తగ్గిస్తుంది.అందుకే శీతాకాలంలో ఎప్పుడు శరీరం వెచ్చగా ఉంచుకోవాలి.అలాగే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
అదేవిధంగా అతిగా మద్యం సేవించకూడదు.ఇలా ఇవన్నీ పాటిస్తే చలికాలం లో ఆరోగ్యంగా ఉండవచ్చు.