ఏపీలో చర్చిల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది.రూ.175 కోట్లతో చర్చిల నిర్మాణం, మరమ్మతులకు ఈ నిధులను వినియోగించనున్నారు.అంతేకాకుండా క్రిస్టియన్ల శ్మశనాల ఆధునికీకరణకు కూడా నిధులు వెచ్చించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో సర్కార్ అందించనుంది.ఈ నెల 19 వ తేదీలోగా ప్రతిపాదనలు అందించాలని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.అదేవిధంగా జిల్లా కేంద్రాలకు కూడా మరో రూ.కోటి చొప్పున మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.







