టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందారో, ఆయన సతీమణి ఉపాసన సైతం జాతీయస్థాయిలో ఎంతో గుర్తింపు పొందారు.ఈమె మహిళ వ్యాపారవేత్తగా అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన తన వ్యక్తిగత విషయాలు కాకుండా తన భర్త రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను అప్డేట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
ఇకపోతే ఈ దంపతులకు ఏదైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తారు.
ఇక సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఆధరాభిమానాలను సొంతం చేసుకున్నారు.ఇలా తన వృత్తిపరమైన విషయాలతో పాటు తన భర్త సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఈమె హీరోయిన్లకు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే ఉపాసన ఇంస్టాగ్రామ్ వేదికగా ఏకంగా ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం.ఇలా ఇంస్టాగ్రామ్ లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో మెగా కోడలు ఉపాసన సైతం స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరని వారికి పోటీగా సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంటున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈమె తన వృత్తిపరమైన విషయాలు మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నో మూగజీవాలను దత్తత తీసుకొని వాటి బాగోగులు చూసుకుంటూ మంచి మనసు చాటుకున్నారు.







