నిన్న తెల్లవారు జామున తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.మన ఇండస్ట్రీలోని మహా శిఖరం అస్తమించింది.
లేవడం లేవడమే సూపర్ స్టార్ కృష్ణ గారి మరణ వార్త వినడం తెలుగు ప్రేక్షకులు జీర్ణించు కోలేక పోతున్నారు.వరల్డ్ వైడ్ గా ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ వార్త విని ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
కృష్ణ గారు లేరు అనే వెలితి టాలీవుడ్ సినీ పరిశ్రమకు కూడా పెద్ద లోటుగానే మిగిలిపోనుంది.ఇక తండ్రి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.
ఈ ఏడాది లోనే ఈయన కుటుంబం నుండి ముగ్గురిని పోగొట్టు కోవడంతో మహేష్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది అనే చెప్పాలి.దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా మహేష్ కష్టానికి బాధ పడుతున్నారు.
కృష్ణ మరణానికి సంతాపం తెలుపుతూ టాలీవుడ్ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.అలాగే ఆయనను చివరిసారి చూసేందుకు తరలి వెళుతున్నారు.
టాలీవుడ్ లోని సినీ, రాజకీయ ప్రముఖులు అంతా కూడా కృష్ణ పార్థివ దేహాన్ని కడసారి చూసి మహేష్ కు దైర్యం చెబుతున్నారు.అయితే చాలా మంది ఫ్యాన్స్ తమ హీరోలు ఒకే దగ్గర కలిస్తే చూడాలని అనుకుంటారు కానీ ఇలాంటి సందర్భంలో అయితే ఎప్పుడు చూడాలని అనుకోరు.
మరి తాజాగా మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగ చైతన్య కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ అయ్యింది.ఈ ఫోటో అంతగా వైరల్ అవ్వడానికి ఒక కారణం కూడా ఉంది.సరిగ్గా వీరి కలయిక లాగానే అలనాటి సూపర్ స్టార్స్ అయిన అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి తారక రామారావు కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చింది.సేమ్ వీరిలాగానే ఇప్పుడు వారి వారసులు కూడా దిగిన ఫోటో వైరల్ అయ్యింది.
అయితే ఇది విషాద సమయంలో కలిసిన కలయిక కాబట్టి ఇలా ఉండకూడదు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.