దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం వారాహి.కాగా ఇప్పటికే సంతోష్ జాగర్లపూడి, సుమంత్ కాంబినేషన్ లో వచ్చిన సుబ్రహ్మణ్యపురం సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
వారాహి సినిమాను జీకే మూవీ మేకర్స్ పతాకం పై రమాదేవి నారగాని నిర్మిస్తున్నారు.ఇది ఇలా ఉండే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమయ్యాయి.
ఇంకా ఈ సినిమాకు దర్శకుడు వివి వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.ఈ సినిమా డివోషనల్ బేస్డ్ మూవీగా ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.ఈరోజు మా సినిమాకు సంబంధించిన పూజాగ్రా కార్యక్రమాలు మొదలు పెట్టాము.మొత్తం మాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారి నేపథ్యంలో డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించబోతున్నాము.ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంబించనున్నాం అని తెలిపారు సంతోష్.
అనంతరం హీరో సుమంత్ మాట్లాడుతూ… సంతోష్ ఈ సినిమా కథ చెప్పగానే క్లాప్స్ కొట్టాను.భారీ ఎత్తున ఈ సినిమా చేయబోతున్నాము.
మా కాంబినేషన్ లో వచ్చిన సుబ్రమణ్యపురం కంటే చాలా బెటర్ స్క్రిప్ట్ ఇది.
అంతేకాకుండా ఇటీవల విడుదల అయిన కాంతార, కార్తికేయ 2 లాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు.అలాంటి ఒక డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా వారాహి ఆకట్టుకుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు హీరో సుమంత్.కాగా ఇటీవల విడుదలైన కార్తికేయ 2, కాంతారా సినిమాలు విడుదల అయి ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ రెండు సినిమాలు కూడా డివోషనల్ గా మంచి సక్సెస్ ను సాధించాయి.మరి ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి అని ఇకపై వచ్చేసి సినిమాలు కూడా సక్సెస్ అవుతాయా.
ఈ రెండు సినిమాల మాదిరిగానే హీరో సుమంత్ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి మరి .