తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర సీరియల్ నటి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటి పల్లవి పూర్తి పేరు పల్లవి రామిశెట్టి.
తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది పల్లవి.మరి ముఖ్యంగా భార్యామణి, ఆడదే ఆధారం, పాపే మా జీవనజ్యోతి,మాటే మంత్రము, అత్తారింటికి దారేది ఇలా పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే నటి సాయి పల్లవి పెళ్లి తర్వాత కూడా పలు సీరియల్స్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
కానీ పెళ్లి తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో సీరియల్స్ కి గుడ్ బాయ్ చెప్పేసింది.
కాగా ఇటీవలే పల్లవి తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రెగ్నెన్సీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది పల్లవి.
ఇది ఇలా ఉంటే తాజాగా పల్లవి తన అభిమానులకు ఒక తెలిపింది.తనకు పండంటి మగ బిడ్డ పుట్టినట్లు పల్లవి తెలిపింది.పుట్టిన బాబుకి సంబంధించిన చిన్ని పాదాలను షేర్ చేసింది.

ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే పల్లవి కెరియర్ విషయానికి వస్తే.ఆమె నటించిన భార్యామణి సీరియల్ కు గాను బెస్ట్ టీవీ యాక్ట్రెస్ గా నంది అవార్డును సైతం అందుకుంది.
ఇక తన బాబు కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఆమె సీరియల్స్ లోకి ఇస్తుందేమో చూడాలి మరి.







