ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
కేసు విచారణను సీబీఐతో దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలైంది.
ఈ క్రమంలో రిట్ అప్పీల్ పై రేపు విచారణ చేపడుతామని చీఫ్ జస్టిస్ బెంచ్ వెల్లడించింది.