బీజేపీకి సరికొత్త నిర్వచనం చెప్పారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.బీ అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అంటూ కొత్త అర్ధాన్ని తెలిపారు.
ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలని తేలిందని చెప్పారు.ప్రధాని మోదీ పర్యటన ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు.
విభజన హామీలు, స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ ఊసే లేదని విమర్శించారు.అధికారంలోకి రాకముందు కేంద్రం మెడలు వంచుతామన్న జగన్.
ఇప్పుడు అదే కేంద్రం ముందు మెడలు వంచి అభ్యర్థిస్తున్నారని ఎద్దేవా చేశారు.విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని వెల్లడించారు.







