తిరుపతి హైవేపై భారీ దోపిడీ కేసును పోలీసులు చేధించారు.రూ.35 లక్షలు ఇస్తే.రూ.70 లక్షలు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేస్తామంటూ మోసానికి పాల్పడ్డారు.దీంతో రెట్టింపు సొమ్ముకు ఆశపడిన శంకర్ బ్యాచ్ రూ.35 లక్షలు తీసుకువచ్చారు.ఈ క్రమంలో శంకర్ బ్యాచ్ కళ్లల్లో కారం కొట్టి రూ.35 లక్షల డబ్బును కృష్ణమూర్తి ముఠా లాక్కెళ్లిపోయారని పోలీసుల విచారణలో తేలింది.కాగా ఈనెల 3న తిరుపతి – చిత్తూరు హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.ఈ కేసులోని ప్రధాన నిందితుడిని పోలీసులు ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం నిందితుడి నుంచి రూ.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.







