కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి కడప జిల్లాలో పర్యటించారు.ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారుల పని తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.కేంద్ర పథకాల అమలులో అధికారుల పనితీరు ఆశాజనకంగా లేదన్నారు.
జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసిందని చెప్పారు.హెల్త్ డిపార్ట్ మెంట్ సరిగా పని చేయడం లేదని అర్ధమవుతోందని మండిపడ్డారు.
దళితుల స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి లెక్కలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా కడపలో స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కూడా సరిగా లేవని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.







