సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటన ఆందోల్ మండలం కన్సాన్ పల్లి సమీపంలో చోటు చేసుకుంది.కాగా, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డుప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







