గత కొద్ది రోజుల నుండి దక్షిణాది రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ముఖ్యంగా చెన్నై పట్టణంలో రికార్డు స్థాయిలో వర్షం పడుతుంది.
దీంతో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందడంతో కురుస్తున్న వర్షాలకు జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
మొన్నటి వరకు కోస్తా తీర ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసాయి.
తాజాగా ఈసైన్య ఋతుపవనాల ప్రభావం ఉపరితల ఆవర్తనంతో ఏపీలో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంది.జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలలో పంట నష్టం కారణంగా చాలామంది రైతులు నష్టపోయారు.
సోమశిల, కండలేరు జలాశయాలకు వరద నీరు భారీగా చేరుకోవటంతో నిండుకుండలా మారాయి.అలాగే తిరుపతి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయి.







