కర్ణాటక రాజకీయాల్లోకి ఎంఐఎం అధికారిక ఎంట్రీ ఇచ్చింది.విజయపుర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇద్దరు కార్పొరేటర్లను గెలుచుకుంది.
నాలుగు సీట్లలో పోటీ చేయగా 25, 28 వార్డులను సొంతం చేసుకుంది.దీంతో విజేతలను ఎంపీ అసదుద్దీన్ అభినందించారు.
కర్ణాటక రాజకీయాల్లో తమ ఎంట్రీ చిరస్మరణీయమైన విజయంతో ప్రారంభమైందని ఆయన ట్వీట్ చేశారు.మొత్తం 35 స్థానాలకుగాను బీజేపీ 17, కాంగ్రెస్ 10 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించాయి.