తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా తన కంటటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు కృష్ణవంశీ.
ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా డేంజర్.క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
నరేష్,స్వాతి,సాయిరాం శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఊహించిన విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ డేంజర్ సినిమా విడుదల అయ్యి దాదాపుగా 17 ఏళ్లు కావస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై దర్శకుడు కృష్ణ వంశీ స్పందించారు.డేంజర్ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించవచ్చు కదా అంటూ ఒక నెటిజన్ ట్విట్ చేయగా ఆ ట్వీట్ పై స్పందించిన.
కృష్ణవంశీ.డేంజర్ సినిమా ఫ్లాప్ సర్.
నా ఉద్దేశం ప్రకారం ప్రేక్షకులు దాన్ని అంగీకరించలేదు.అలాంటప్పుడు ఆ సినిమాకి కొనసాగింపు ఎలా చేయగలను అని కృష్ణవంశీ సమాధానం ఇచ్చారు.
క్రమంలోనే మరొక నెటిజెన్ మీ ఉద్దేశంలో ఫ్లాప్ అంటే ఏమిటో నాకు తెలియదు కానీ ఆ సినిమా నా మనసును దోచుకుంది అని ట్విట్ చేయగా.
![Telugu Ali, Danger, Danger Sequel, Krishna Vamsi, Rahul Sipliganj, Ramya Krishna Telugu Ali, Danger, Danger Sequel, Krishna Vamsi, Rahul Sipliganj, Ramya Krishna](https://telugustop.com/wp-content/uploads/2022/11/danger-sequel-tollywood-Ramya-Krishna.jpg )
ఆ ట్వీట్ పై స్పందించిన కృష్ణవంశీ.సినిమాపై పెట్టిన డబ్బులు కూడా నిర్మాత తిరిగి పొందలేక పోతే దానిని ఫ్లాప్ అంటారు.డబ్బే రాజ్యం అని ఏలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాడు కృష్ణవంశీ బదులు ఇచ్చాడు.
ఇకపోతే కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్,నటుడు ఆలీ, వంశీ చాగంటి, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.