టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం..

టీ20 వరల్డ్ కప్ లో మరో సంచనం చోటుచేసుకుంది.గెలుపు అంచనాలు లేని కొత్త జట్లు ఈ మెగా టోర్నీలో బలమైన జట్లను మట్టి కరిపిస్తున్నాయి.

 Another Sensation In T20 World Cup..-TeluguStop.com

గురువారం రాత్రి ముగిసిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది.జింబాబ్వే చేతిలో పాక్ ఓటమి పాలైంది.

అది కూడా ఒకే ఒక్క పరుగు తేడాతో పాక్ ఓడిపోవడం గమనార్హం.ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన జింబాబ్వే జట్టు మరో సంచలనాన్ని నమోదు చేసింది.

ముందుగా పాక్ బౌలర్ల ధాటికి పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డ జింబాబ్వే బ్యాటర్లు… 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగారు.ఇక 131 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది పాక్ .ఇక చివరి దాకా పోరాటం చేసిన పాక్…తన ఇన్నింగ్స్ లో చివరి బంతికి ఒక్క పరుగు చేయలేక ఓడిపోయింది.20 ఓవర్లలో పాక్ 8 వికెట్ల నష్టానికి కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగింది.సింగిల్ పరుగుతో జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube