ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి వైరస్ పుట్టినిల్లు చైనాలో ఇప్పటికీ కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.ఈ క్రమంలో ప్రభుత్వం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను లాక్ డౌన్ పెడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కి టీకాలు రావటం తెలిసిందే.అన్నీ కూడా ఇంజక్షన్ రూపంలో వచ్చాయి.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు చైనాలో కరోనా కట్టడి చేయడానికి కొత్త రకం కరోనా టీకా తీసుకురావడం జరిగింది.సూది అవసరం లేకుండానే నోటి ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీని చైనా ప్రారంభించింది.
ఈ తరహా వ్యాక్సిన్ ప్రపంచంలో మొదటిగా భావిస్తున్నారు.ఈ వ్యాక్సిన్ లోని ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది.
ప్రక్రియ మొత్తం కేవలం 20 సెకండ్లలోనే ముగుస్తుందని చైనా అధికారులు తెలిపారు.సూదితో వ్యాక్సిన్ తీసుకొని వారికి ఇది దోహదపడుతుందని చెప్పుకొస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు కరోనా ప్రభావం తగ్గింది.అయినా గాని ఏ నిమిషం అయినా మళ్లీ కేసులు పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తప్పనిసరిగా మాస్క్ ధరిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.