విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి, ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్?

తాజాగా టీం ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండగా ఇండల్ప్ గెలుస్తారా అని ఉత్కంఠ గా కొనసాగగా చివరికి ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఇక విజయం అసాధ్యమే అనుకుంటున్న సమయంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య క్రీజులో నిలదొక్కుకొని ఆటలో చివరి వరకు గట్టిగా పోరాడారు.చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టాడు.

 Virat Kohli Leads India To The Victory Over Pakistan Ntr Rajamouli Praises ,vira-TeluguStop.com

అలా 53 బంతుల్లో 82 పరుగులు చేసి విరాట్ కోహ్లీ కీలక మ్యాచ్ లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు.ఈ క్రమంలో కోహ్లీ ఇన్నింగ్స్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.

అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి ఆయన సతీమణి అనుష్క శర్మ, క్రికెట్ ప్రేమికులు, అభిమానులు విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్స్ కూడా విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచేత్తారు.

వారు ఒకరు రాజమౌళి కాగా మరొకరు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్.ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని పొగుడుతూ రాజమౌళి ఈ విధంగా ట్వీట్ చేశారు.కింగ్ కోహ్లీ.

మీకు వందనాలు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.అలాగే జూనియర్ ఎన్టీఆర్.

అద్భుతమైన రన్ ఛేజ్, కోహ్లీతో పాటు టీం సభ్యులు తమ ప్రయత్నంతో మరపురాని విజయాన్ని అందుకున్నారు అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు జపాన్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈనెల 21వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాలో థియేటర్లలో విడుదల చేయడం కోసం అక్కడికి వెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube